రేపు కాళేశ్వరానికి సీఎం కేసీఆర్!

X
By - TV5 Digital Team |18 Jan 2021 5:57 PM IST
రేపు(మంగళవారం ) తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్కు చేరుకోనున్నారు.
రేపు(మంగళవారం ) తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజ్కు చేరుకోనున్నారు. అనంతరం అక్కడ అధికారులతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని కేసీఆర్ సందర్శించనున్నారు. బ్యారేజ్ పరిసరాల్లో అధికారులతో కలిసి సుమారు 4 గంటల పాటు పర్యటించనున్నారు సీఎం.. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి అనంతరం హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు. మేడిగడ్డ వద్ద ప్రస్తుతం వంద అడుగులకు నీటిమట్టం చేరింది. కాగా కాళేశ్వరం ఎత్తిపోతలను అధికారులు ఆదివారం రోజు ప్రారంభించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లింక్-1, 2లలో గోదావరి జలాల తరలింపు లక్ష్యంగా మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com