నీటి పారుదల రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు : మంత్రి హరీష్రావు

X
By - TV5 Digital Team |25 March 2021 9:30 PM IST
అసెంబ్లీలో బడ్జెట్పై జరిగిన చర్చలో మాట్లాడిన హరీష్రావు.. సాగునీటి రంగంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు.
నీటి పారుదల రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి హరీష్రావు అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్పై జరిగిన చర్చలో మాట్లాడిన హరీష్రావు.. సాగునీటి రంగంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం అని.. ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేసుకున్నామని స్పష్టంచేశారు. వ్యవసాయ ఉత్పత్తుల విలువ లక్ష కోట్లు దాటిందన్న హరీష్రావు.. యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోందని తెలిపారు. మండుటెండల్లోను మిషన్ కాకతీయ చెరువులు నీళ్లు పారుతున్నాయని.. వాగులపై చెక్డ్యాములు నిర్మిస్తున్నామని మంత్రి హరీష్రావు చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com