మధ్యాహ్నం రెండు గంటలకు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం
By - Prasanna |24 Aug 2021 5:58 AM GMT
ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగబోతోంది. తెలంగాణ భవన్లో జరిగే ఈ మీటింగ్కు సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన పద్దతి, తీసుకోవాల్సిన చర్యలు, పార్టీపరంగా చేయాల్సిన కృషిపై చర్చిస్తారు. దీంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చిస్తారని తెలుస్తోంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర శాఖల పునర్నిర్మాణం, అందుకోసం తేదీల ఖరారు వంటి అంశాలపై చర్చిస్తారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com