Telangana: తిమ్మాపూర్లో సీఎం కేసీఆర్ దంపతులు
Telangana: సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్ లో పర్యటిస్తున్నారు. తిరుమలగా పేరుగాంచిన తిమ్మాపూర్వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో సీఎం దంపతులు పాల్గొన్నారు. సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. దాదాపు 23 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన కళ్యాణకట్ట మండపం, రాజగోపురం, మాడ వీధుల ప్రాకరం, యజ్ఞశాల వసతి గృహాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దాతల సహాయంతో తయారు చేయించిన రెండు కిలోల బంగారు కిరీటాన్ని స్వామి వారికి అందజేశారు సీఎం కేసీఆర్
తిమ్మాపూర్లో సీఎం కేసీఆర్ దంపతులు
వేంకటేశ్వరస్వామి ఆలయానికి సీఎం దంపతులు
పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికిన ఆలయ అర్చకులు
వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో సీఎం కేసీఆర్ దంపతులు
స్వామి వారికి రెండు కిలోల బంగారు కిరీటం అందజేసిన సీఎం
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com