KCR : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్..

KCR : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్..
KCR : సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం కేసీఆర్

KCR : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధానాలయ దివ్య విమానగోపురం స్వర్ణ తాపడం కోసం...కిలో 16 గ్రాముల బంగారాన్ని విరాళంగా సమర్పించారు. ముఖ్యమంత్రి దంపతులు తమ మనవడు హిమాన్షు చేతుల మీదుగా ఆ బంగారాన్ని అందజేశారు. అనంతరం కేసీఆర్‌ దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు.

అంతకుముందు ప్రధానాలయంలో కేసీఆర్ దంపతులకు అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు...VIS

అంతకుముందు రోడ్డు మార్గం ద్వారా ప్రత్యేక బస్సులో యాదాద్రికి చేరుకున్న కేసీఆర్‌ .. బస్సులోనే కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రెసిడెన్షియల్ సూట్ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అటు ప్రెసిడెన్షియల్ సూట్స్‌లో నే వివిధ శాఖల అధికారులతో సుమారు గంటపాటు సీఎం సమీక్ష నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story