ఎల్బీ స్డేడియానికి చేరుకున్న సీఎం కేసీఆర్
By - kasi |28 Nov 2020 12:10 PM GMT
జీహెచ్ఎంసీ ఎన్నికల సమరశంఖం పూరించింది టీఆర్ఎస్. ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఎల్బీ స్డేడియానికి చేరుకున్నారు. ఇక నగరం నలుమూలల్లోని వివిధ డివిజన్లలో అభ్యర్థులు ఏర్పాటు చేసిన బస్సుల్లో పెద్దఎత్తున కార్యకర్తలు, ప్రజలు సభకు తరలివచ్చారు. సభ ద్వారా నగర ప్రజలకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సందేశమివ్వనున్నారు. సభకు మంత్రులు, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, కార్పొరేటర్లు హాజరయ్యారు. కొవిడ్ నిబంధనల మేరకు ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. సభను దృష్టిలో పెట్టుకుని ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సభకు ముందు వేదికపై, స్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com