కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిపై వరాల జల్లు..!

కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిపై వరాల జల్లు కురిపించారు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సీఎం.. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందరూ పట్టుపట్టి బంగారు వాసాలమర్రిగా తీర్చిదిద్దుదామని అన్నారు. గ్రామంలో ప్రజలంతా సోదరభావం మెలగాలని చెప్పారు. వాసాలమర్రి మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. అంకాపూర్ తరహాలో వాసాలమర్రి అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. వాసాలమర్రిని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుదామని అన్నారు.
గ్రామ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఊరంతా ఒక్కతాటిపై రావాలని సూచించారు. గ్రామంలోని ప్రతి కుటుంబం పూర్తి వివరాలు సేకరించాలని అధికారుల్ని ఆదేశించారు. గ్రామస్తులంతా కలిసి వారంలో రెండు గంటలు ఊరు కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా కలసికట్టుగా పని చేయాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. తరపున
వాసాలమర్రిలో గ్రామ నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామంలో జబ్బు పడిన వారికి హైదరాబాదులో మంచి వైద్యం చేయిస్తామని వెల్లడించారు. సర్పంచ్, కలెక్టర్ ఆ బాధ్యతను నిర్వహించాలని సూచించారు. విద్యావంతులు, రిటైర్డ్ ఉద్యోగులు ఊరి మంచి కోసం నడుం బిగించాలని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా... యాదాద్రి భువనగిరి జిల్లాలోని 421 గ్రామ పంచాయతీలకు 25లక్షల రూపాయల చొప్పున మంజూరు చేశారు.
భువనగిరి మున్సిపాలిటీకి కోటి రూపాయలు, మిగతా ఐదు మున్సిపాలిటీలకు 50లక్షల చొప్పున నిధులు కేటాయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com