REVANTH: సీఎం రేవంత్ క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైదరాబాద్ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. బీజేపీ తరఫున న్యాయవాది వాదనలు వినిపించేందుకు సమయం కోరడంతో జూలై 8వ తేదీని తదుపరి విచారణ తేదీగా న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో ప్రధాన అంశం – బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు సీఎం రేవంత్పై పరువునష్టం దావా వేసిన విషయం. బీజేపీ అధికారంలోకి వచ్చినపుడు రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి ఓ సభలో చేసిన వ్యాఖ్యలు, తమ పార్టీ ప్రతిష్టను దిగజార్చినట్లుగా, ప్రజల్లో అపోహలు కలిగించాయంటూ వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. దీంతో రేవంత్ ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తాజా తీర్పుతో రాజకీయ, న్యాయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com