CM Revanth Reddy : శాఖల మార్పులపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

CM Revanth Reddy : శాఖల మార్పులపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ
X

శాఖల మార్పులపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ సందర్భంగా మాట్లాడుతూ.. నా దగ్గర ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తానన్నారు. సీఎం ప్రకటనతో పాత మంత్రుల వద్ద శాఖల్లో మార్పులు లేనట్లేనని తెలుస్తోంది. సీఎం దగ్గర హోం, మున్సిపల్, క్రీడలు, విద్యతో పాటు కీలకమైన 11 శాఖలున్నాయి. నేను ఢిల్లీకి వచ్చింది.. తెలంగాణ, కర్ణాటకలో విజయవంతమైన కులగణన వివరాలు పంచుకోవడానికి.. నేను అధికారంలో ఉన్నంత వరకూ.. కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ లో నో ఎంట్రీ.. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు అని సీఎం అన్నారు. కాళేశ్వరం గురించి రెండు రోజుల్లో ప్రెస్‌ మీట్‌ పెడతాను. డాక్యుమెంట్లన్నీ బయటపెడతా. తెలంగాణకు సంబంధించి కేంద్రంలో అన్నింటికీ అడ్డుపడుతున్నది కిషన్‌రెడ్డి అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

మరోవైపు కొన్ని వర్గాల నుంచి ఫిర్యాదులు రావడంతో మరోసారి కులగణన చేపట్టడానికి కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది. 60 నుంచి 80 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే,రాహుల్ గాంధీ, సీఎం సిద్ధ రామయ్య,కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమావేశమై చర్చించారు. కుల గణనతో పాటు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధానంగా చర్చించారు.

Tags

Next Story