REVANTH: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి రేవంత్‌

REVANTH: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి రేవంత్‌
X
నేడు సాయంత్రం భారీ బహిరంగసభ... హాజరుకానున్న మంత్రులు

తెలంగాణలో మూడు MLC స్థానాలకు ఎన్నికలు ఫిబ్రవరి 27న జరగనున్నాయి. ఈ నెల 25తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. కాంగ్రెస్‌ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ అభ్యర్థుల తరపున మంత్రులు ప్రచారం చేస్తున్నారు. కాగా నేడు సీఎం రేవంత్ రెడ్డి MLC ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి మూడు జిల్లాల్లో పర్యటిస్తారు. సీఎం తోపాటు టీపీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ పలువురు మంత్రులు హాజరై ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాలలో పట్టభద్రులతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. రేపటితో ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి పార్టీ నేతల సహకారం సన్నగిల్లిందనే ప్రచారం జోరు అందుకుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

కరీంనగర్‌లో ఇలా..

కరీంనగర్‌లో రేవంత్ ప్రచారం చేయనున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి వి. నరేందర్ రెడ్డికి మద్దతుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. మంచిర్యాల నుంచి హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 4:20కి చేరుకోనున్నారు. బహిరంగ సభ అనంతరం సాయంత్రం 6:00 గంటలకు హైదరాబాద్కు వెళ్లనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కరీంనగర్ లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే ఎమ్మెల్సీ పట్టభద్రుల భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సీఎం టూర్ ఖరారు కావడంతో మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కు చేరుకొని పార్టీ శ్రేణులతో సమావేశమై ఏర్పాట్ల పై దృష్టి పెట్టారు. సభకు ప్రతి కార్యకర్త ఒక పట్టభద్రుని తీసుకొని హాజరు కావాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.

Tags

Next Story