REVANNTH: టీటీడీ దర్శనాలకు అడుక్కోవద్దు

REVANNTH: టీటీడీ దర్శనాలకు అడుక్కోవద్దు
X
మనకు గుడులు లేవా... ప్రజాపాలనలో కొలువుల పండగ కార్యక్రమంలో రేవంత్ కీలక వ్యాఖ్యలు

రవీంద్రభారతిలో నిర్వహించిన ‘ప్రజాపాలనలో కొలువుల పండగ’ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు రూ.8,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి. మార్కెట్లో అప్పు పుట్టడం లేదు. ఎవ్వడు మనల్ని నమ్మడం లేదు. ’ అని వ్యాఖ్యానించారు. అలాగే టీటీడీ దర్శనాలకు వాళ్లని అడుక్కోవడం ఎందుకని, మనకి మన గుడులు లేవా అని అన్నారు. తన టెంపర్మెంట్‌లో ఎలాంటి మార్పు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 2004లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి టెంపర్మెంట్ ఇప్పటికీ అలాగే కొనసాగుతోందని తెలిపారు. సీఎంగా మరింత హుందాగా ఉండాలని కొందరు అభిప్రాయపడుతున్నా.. అటు వైపు అర్థం చేసుకునే ప్రజలు ఉండాలని చెప్పారు. టెంపర్మెంట్ తగ్గితే న్యాయం చేయడం కష్టమని, తన దూకుడు తగ్గలేదు కానీ అనుభవంతో జ్ఞానం పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఇంకా పట్టు రాలేదంటున్నారు..

రేవంత్‌ రెడ్డికి పాలనలో పట్టు రాలేదని ఇంకా కొందరు అంటున్నారని.. అంటే దళితుడు రాజయ్యను, బలహీన వర్గాలకు చెందిన ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తప్పిస్తే పట్టు వచ్చినట్లా అని రేవంత్ సూటిగా ప్రశ్నించారు. వాళ్లను తీసేయడానికి సహేతుకమైన కారణం చెప్పి ఉంటే నీకు పట్టు ఉన్నట్లుే అని సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు సచివాలయానికే రాని వ్యక్తికి పాలనపై పట్టు వచ్చిందని అంటున్నారని, ప్రతి రోజూ 18 గంటలు పని చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్న తనకు పట్టు రాలేదని అంటున్నారని విమర్శించారు. అప్పుడూ ఇప్పుడూ అధికారులు వాళ్లేనని, వ్యవస్థ కూడా అదేనని, మారింది కేవలం 11 మంది మంత్రులు మాత్రమేనని రేవంత్ తెలిపారు. అప్పుడు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ ఉంటే.. ఇప్పుడు రేవంత్‌, సీతక్క, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ శాఖలో 588 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. అదేవిధంగా పురపాలక శాఖ, మిషన్‌ భగీరథ విభాగాల్లో పలు ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలను అందజేశారు. ‘బిల్డ్‌ నౌ’ పోర్టల్‌ను ఆవిష్కరించారు.

చిరంజీవికి సీఎం రేవంత్ అభినందనలు

బ్రిటన్‌లో జీవన సాఫల్య పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవిని CM రేవంత్ రెడ్డి అభినందించారు. ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న చిరంజీవిగారికి హృదయపూర్వక అభినందనలు. మీకు లభించిన ఈ గౌరవం తెలుగుజాతికి గర్వకారణం. భవిష్యత్తులో మీరు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్ఠలను విశ్వవేదికపై చాటిచెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని రేవంత్ ట్వీట్ చేశారు.

Tags

Next Story