ఎమ్మెల్యే జోగు రామన్న, రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ మధ్య వాగ్వాదం..!
By - TV5 Digital Team |25 April 2021 10:30 AM GMT
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా పరిస్థితిపై కలెక్టర్ రేట్ లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే జోగు రామన్న, రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా పరిస్థితిపై కలెక్టర్ రేట్ లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే జోగు రామన్న, రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రిమ్స్ డైరెక్టర్ నిర్లక్ష్యంతో ఆసుపత్రికి వచ్చే కరోనా రోగులు ఇబ్బందులు పడుతున్నాంటూ తన దృష్టికి వచ్చిందని జోగు రామన్న తెలిపారు. దీనిపై స్పందించిన డైరెక్టర్.. కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రెమ్ డెసివర్ ఇంజక్షన్ల కోసం కొంత మంది ఎమ్మెల్యే పేరు చెప్పినా... తాను నిరాకరించడంతోనే తనపై కక్ష కట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే ఈ ఆరోపణలకు ఎమ్మెల్యే కొట్టిపారేశారు. మొత్తానికి ఇద్దరి మధ్య వాగ్వాదంతో సమావేశం వాడివేడిగా జరిగింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com