CONGRESS: కొనసాగుతున్న కాంగ్రెస్ జనహిత పాదయాత్ర

CONGRESS: కొనసాగుతున్న కాంగ్రెస్ జనహిత పాదయాత్ర
X

ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునేందుకు, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునేందుకు జనహిత పాదయాత్ర చేపట్టామని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. కరీం­న­గ­ర్ జి­ల్లా­లో చొ­ప్ప­దం­డి ని­యో­జ­క­వ­ర్గం­లో కాం­గ్రె­స్ రెం­డో హిత జన­హిత పా­ద­యా­త్ర కొ­న­సా­గు­తోం­ది. పా­ర్టీ వ్య­వ­హా­రాల ఇన్చా­ర్జి మీ­నా­క్షి నట­రా­జ­న్, పీ­సీ­సీ చీఫ్ మహే­ష్ కు­మా­ర్ గౌడ్, డి­ప్యూ­టీ సీఎం భట్టి వి­క్ర­మా­ర్క­తో పాటు పలు­వు­రు మం­త్రు­లు రా­ష్ట్ర నా­య­కు­లు జన­హిత పా­ద­యా­త్ర­లో పా­ల్గొ­న్నా­రు. జన­హిత పా­ద­యా­ద్ర­కు భా­రీ­గా కాం­గ్రె­స్ శ్రే­ణు­లు తర­లి­వ­చ్చా­యి. నేడు శ్ర­మ­దా­నం, కా­ర్య­క­ర్తల సమా­వే­శం నే­ప­థ్యం­లో కరీం­న­గ­ర్ నుం­చి భా­రీ­గా కా­ర్య­క­ర్త­ల­ను తర­లిం­చా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. అయి­తే కలి­సి­క­ట్టు­గా కా­కుం­డా నే­త­లు ఎవ­రి­కి వారే సమా­వే­శా­లు ని­ర్వ­హిం­చ­డం రా­జ­కీ­యం­గా చర్చ­నీ­యాం­శం­గా మా­రిం­ది. మం­త్రి శ్రీ­ధ­ర్ బాబు సుడా చై­ర్మ­న్ కో­మ­టి­రె­డ్డి నరేం­ద­ర్ రె­డ్డి­ని ప్రో­త్స­హి­స్తుం­డ­గా మరో మం­త్రి పొ­న్నం ప్ర­భా­క­ర్ వె­లి­చాల రా­జేం­ద­ర్ రా­వు­ను ఎం­క­రే­జ్ చే­స్తుం­డ­డం గ్రూ­ప్ రా­జ­కీ­యా­ల­కు మరింత బలం చే­కూ­రు­తుం­ది. మరో నేత ఆల్పో­ర్స్ నరేం­ద­ర్ రె­డ్డి సైతం వీ­రి­కి ధీ­టు­గా జన­స­మీ­క­ర­ణ­లో ని­మ­గ్న­మ­య్యా­రు. అయి­తే జన­హిత పా­ద­యా­త్ర ద్వా­రా ప్ర­జ­ల్లో సా­ను­కూ­లత పెం­చా­ల­ని పా­ర్టీ భా­వి­స్తుం­టే నే­త­లు ఎవ­రి­కి వారే అన్న­ట్లు వ్య­వ­హ­రిం­చ­డం రా­జ­కీ­యం­గా దు­మా­రం రే­పు­తోం­ది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల సహకారంతో చొప్పదండ నియోజకవర్గాన్ని రోల్‌ మోడల్‌గా తీర్చి దిద్దుతానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నా రు. పాదయాత్ర అనంతరం మధురానగర్‌ చౌరస్తాలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే సత్యం మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యం అన్నారు. పదేళ్ల పాలనలో ఒక్క ఇళ్లు ఇవ్వలేదని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రతి గ్రా మానికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిందన్నారు. చురుగ్గా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.

Tags

Next Story