తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై కొనసాగుతోన్న ప్రతిష్ఠంభన

X
By - Nagesh Swarna |26 Dec 2020 4:57 PM IST
ఢిల్లీలో మకాం వేసిన పార్టీ సీనియర్లు, చివరిప్రయత్నాల్లో బిజీబిజీగా ఉన్నారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. అధికారిక ప్రకటనకు మరో రెండ్రోజులు పట్టే అవకాశం ఉంది. పీసీసీతో పాటు సమూల ప్రక్షాళనకు హైకమాండ్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఐదు కమిటీలు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికీ ఢిల్లీలో మకాం వేసిన పార్టీ సీనియర్లు, చివరిప్రయత్నాల్లో బిజీబిజీగా ఉన్నారు.
మరోవైపు రాష్ట్రంలో పీసీసీ చీఫ్ ఎంపికపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సీనియర్ నేత వీహెచ్పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. వీహెచ్కు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చేందుకు ఏఐసీసీ సిద్ధమైంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com