Telangana Congress: బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ఆగమైపోయింది: భట్టి

Telangana Congress: బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ఆగమైపోయింది: భట్టి

కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమైపోయిందని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. కేసీఆర్‌ ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టి రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. ఖమ్మం మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఖమ్మం జిల్లా మధిర మండలంలో భట్టి పర్యటించారు. మధిర డివిజన్‌లోని వివిధ పార్టీలకు చెందిన సుమారు వెయ్యిమంది కాంగ్రెస్‌లో చేరగా భట్టి, పొంగులేటి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story