Congress Meet Kodandaram : టీజెఎస్ కాంగ్రెస్ కలిసి ముందుకు వెళ్తాయా..?

Congress Meet Kodandaram : టీజెఎస్ కాంగ్రెస్ కలిసి ముందుకు వెళ్తాయా..?
Congress Meet Kodandaram : తెలంగాణలో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా పార్టీలు కలిసి పోటీచేయాలని భావిస్తుంటాయి.

Congress Meet Kodandaram : తెలంగాణలో రాజకీయాలు విచిత్రంగా వుంటాయి. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా వివిధ పార్టీలు కలిసి పోటీచేయాలని భావిస్తుంటాయి.లేటేస్ట్‌గా ప్రొఫెసర్ కోదండరాం పార్టీ తెలంగాణ జనసమితితో కలిసి నడవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

ఎలాగైనా మనుగోడు ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో వున్న కాంగ్రెస్ తన సిద్ధాంతాలకు మద్దతు ఇచ్చే పార్టీల వైపు కన్నేసింది. అందులో భాగంగాటీపీసీసీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.తమతో కలిసి వచ్చే పార్టీలు ఏమున్నాయి అనే విషయంపై ఆరా తీస్తున్నాయి. అందులో భాగంగా టీజెఎస్ వారికి కనిపించింది. ఆ పార్టీ అధినేత కోదండరాం తో కాంగ్రెస్ నేతలు భేటీ కావడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.

అటు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి కోదండరాంతో భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మద్దతు పై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచన మేరకు కోదండరాంని కలిశాం అన్నారు మహేష్ గౌడ్. త్వరలో జరగబోయే మునుగోడు ఎన్నికలపై చర్చ చేశాం…ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మద్దతు ఇవ్వాలని కోరాం.. కమిటీ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని కోదండరాం చెప్పారు.

టీఆర్ఎస్-బీజేపీ వ్యవహార శైలిపై చర్చ జరిగింది… రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నాం.. సిద్ధాంత పరంగా మాతో కలిసి వచ్చే పార్టీ లను కలుపుకుని పోతాం అన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, టిఆర్ఎస్ ను ఓడించాలంటే తమకు మద్దతు పలకాలని మహేష్ గౌడ్ కోదండరాంని కలిసి కోరారు.

మరోవైపు మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. అయితే, మునుగోడులో మళ్ళీ గెలుపు అనుకున్నంత ఈజీ కాదని, కాస్త కష్టమయినా గెలిచే సత్తా వుందని కాంగ్రెస్ భావిస్తోంది. మునుగోడులో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడం ద్వారా, ఇక్కడ విజయం సొంతం చేసుకోవచ్చనే లెక్కలు వేసుకుంటోంది టీపీసీసీ. అయితే తక్కువ కాలం మాత్రమే పదవీకాలం వున్న వేళ కాంగ్రెస్ కు అంత బలమయిన వ్యక్తి ఎవరు దొరుకుతారనేది మిస్టరీగా మారింది. బీజేపీ-టీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం వుందని, అందులో భాగమే మునుగోడు ఎన్నికలు అంటున్నారు కాంగ్రెస్ నేతలు.

ఇక కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఇప్పటికే ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ టికెట్‌ను పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కూతురు, చెరుకు సుధాకర్‌తోపాటు మరో ఐదారుగురు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట ప్రకటన తర్వాత అంతర్గత కలహాలు మరింత పెరిగే అవకాశం ఉంది. వీటిని చల్లార్చడం టీపీసీసీ అధ్యక్షుడికి సవాలేనని చెప్పక తప్పదు.

Tags

Read MoreRead Less
Next Story