బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత మహేశ్వర్‌ రెడ్డి..?

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత మహేశ్వర్‌ రెడ్డి..?
మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. కాసేపట్లో తరుణ్ చుగ్ ఇంటికి ఈటల, మహేశ్వర్ రెడ్డి వెళ్తారని తెలుస్తోంది

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మహేశ్వర్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతుంది. మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. కాసేపట్లో తరుణ్ చుగ్ ఇంటికి ఈటల, మహేశ్వర్ రెడ్డి వెళ్తారని తెలుస్తోంది. అనంతరం జేపీ నడ్డాను మహేశ్వర్ రెడ్డి కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉదయం ఢిల్లీ వెల్లిన మహేశ్వర్ రెడ్డి.. పలువురు నేతలను కలవనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.

నిర్మల్‌ లో తన అనుచరులతో కలిసి సమావేశం నిర్వహించడంపై మహేశ్వర్‌ రెడ్డి పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. పీసీసీ షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఖర్గే వద్ద తేల్చుకుంటానంటూ ఢిల్లీ వెళ్లిన మహేశ్వర్ రెడ్డి బీజేపీ నేతలను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మహేశ్వర్‌ రెడ్డి ఖర్గేను కలుస్తారా లేక బీజేపీలో చేరతారా అన్న దానిపై సస్పెన్స్‌ కొనసాగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story