Telangana : తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత అప్పుడే..!

X
By - TV5 Digital Team |3 Jun 2021 6:45 PM IST
లాక్ డౌన్ కారణంగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు డి హెచ్ శ్రీనివాస్ తెలిపారు.
లాక్ డౌన్ కారణంగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు డి హెచ్ శ్రీనివాస్ తెలిపారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2261 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనాతో 18 మంది మరణించారు. ఇక కరోనా నుంచి మూడు వేల 43 మంది కోలుకున్నారని శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివీటి రేటు 2 శాతానికి తగ్గిందని అన్నారు. వచ్చే వారంలో కరోనా కేసులు తగ్గితే లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఇక అటు గత పది రోజులుగా బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1100 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com