తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్
By - TV5 Digital Team |23 April 2021 4:43 AM GMT
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. తనకు స్వల్ప లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకున్నానని.. పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. తనకు స్వల్ప లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకున్నానని.. పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు వెల్లడించారు. కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు. కరోనా చికిత్స తీసుకునేందుకు సీఎం కేసీఆర్ రెండు రోజుల క్రితం యశోద ఆస్పత్రికి వచ్చారు. ఆ సమయంలో కేసీఆర్ పక్కన కేటీఆర్ ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్ కరోనా నుంచి కోలుకుంటున్నారు. KTRకి స్వల్పంగానే కోవిడ్ లక్షణాలు ఉన్నందున త్వరగా కోలుకుంటారని వైద్యులు చెప్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com