కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి : ఎమ్మెల్యే సీతక్క

X
By - TV5 Digital Team |26 April 2021 4:30 PM IST
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరాపార్క్లో ఆమరణ దీక్ష చేస్తున్నారు ఎమ్మెల్యే సీతక్క..
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరాపార్క్లో ఆమరణ దీక్ష చేస్తున్నారు ఎమ్మెల్యే సీతక్క, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్.. ఆరోగ్యశ్రీ అందరికీ అన్నిటికీ ప్రజా ఆరోగ్య ఆమరణ నిరాహార దీక్ష పేరుతో వారు దీక్ష చేస్తున్నారు. ఉచిత అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కరోనాతో మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి హాస్పత్రిలో కట్టిన బిల్లులను మొత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరాహార దీక్ష కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com