కరోనాను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలి : ఉత్తమ్

X
By - TV5 Digital Team |29 April 2021 11:45 AM IST
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కరోనాతో వైద్యం చేయించుకుంటూనే ఆసుపత్రి నుంచి వీడియో సందేశం పంపారు.
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కరోనాతో వైద్యం చేయించుకుంటూనే ఆసుపత్రి నుంచి వీడియో సందేశం పంపారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన అందరికీ ధన్యావాదాలు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ను ఆరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. పేద ప్రజలు కరోనా బారిన పడితే వైద్య సేవలు అందక నానా కష్టాలు పడుతున్నారని.. ఇది అత్యంత బాధాకరమన్నారు. ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం కనీస బాధ్యత అని.. కానీ ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించకపోవడం దురదృష్టకరమని ఉత్తమ్ విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com