తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ..!

X
By - TV5 Digital Team |29 April 2021 2:30 PM IST
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. రేపటితో రాత్రి కర్ఫ్యూ ముగియనున్నందున.. తర్వాత చర్యలు ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది.
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. రేపటితో రాత్రి కర్ఫ్యూ ముగియనున్నందున.. తర్వాత చర్యలు ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. రేపు పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడంతో..చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. నియంత్రణ చర్యలపై దాగుడుమూతలెందుకు? కనీసం ఒక రోజు ముందు చెబితే నష్టమేంటన్న హైకోర్టు.. నియంత్రణ చర్యలపై తాము ఎలాంటి సూచనలు ఇవ్వడం లేదంది. క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోండని సూచించింది. ఐతే.. ప్రభుత్వాన్ని సంప్రదించి మధ్యాహ్నంలోగా చెబుతామని ఏజీ.. బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com