తెలంగాణలో కొత్తగా 2,734 పాజిటివ్ కేసులు
By - kasi |1 Sep 2020 5:15 AM GMT
తెలంగాణాలో గత 24 గంటల్లో కొత్తగా 2734 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,27,697 కు చేరింది. వైరస్ భారిన పడి కొత్తగా మరో 9 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 836 కు చేరింది. సోమవారం ఒక్కరోజే 2325 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు మహమ్మారి నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 95,162 కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 31,699 గా ఉంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com