Crime: అపార్ట్మెంట్పై నుంచి పడి బాలిక మృతి

X
By - Subba Reddy |16 Jan 2023 12:00 PM IST
ముగ్గును పైనుంచి ఫోటొ తీస్తుండగా ప్రమాదం
హైదరాబాద్లోని కుషాయిగూడలో విషాదం చోటు చేసుకుంది. తాను వేసిన ముగ్గును ఫొటో తీస్తు భవనంపై నుంచి పడి 14ఏళ్ల బాలిక మృతి చెందింది.
కుషాయిగూడలోని శారదా నగర్కు చెందిన పొలిశెట్టి కినార అనే 14ఏళ్ల బాలిక సంక్రాంతి సందర్భంగా శనివారం తమ అపార్ట్మెంట్ ముందు చక్కగా ముగ్గువేసింది. ఆ ముగ్గును పైనుంచి ఫొటో తీసేందుకు ఐదంతస్థుల అపార్ట్మెంట్పైకి ఎక్కింది ఈ క్రమంలో అదుపు తప్పి కింద పడిపోయింది.
వెంటనే కుటుంబ సభ్యులు బాలికను ఆసుపత్రికి తరలించగా వైద్యం చేస్తుండగానే ప్రాణాలు విడిచింది. గాంధీ ఆసుపత్రిలో బాలిక మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com