Crime: ప్రీ లాంచ్‌ పేరుతో కోట్లలో కుచ్చుటోపి

Crime: ప్రీ లాంచ్‌ పేరుతో కోట్లలో కుచ్చుటోపి
రియల్ ఎస్టేట్ పేరుతో వందల కోట్లు వసూలు...

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తాజాగా మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రీ లాంచ్‌ పేరుతో అమాయకులకు కోట్లలో కుచ్చుటోపి పెట్టాడో కిలాడి. కాకర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ సంస్థ పేరుతో వందల కోట్ల రుపాయల మేర వసూలు చేశాడు. 10 లక్షల రూపాయల నుండి 50 లక్షల రూపాయల వరకు బాధితులు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఫ్లాట్లు ఇస్తానంటూ మాయమాటలు చెప్పి కాలాన్ని వెల్లబుచ్చుతున్నాడు. రెండేళ్లు గడుస్తున్నా ఫ్లాట్‌లను కంపెనీ ప్రతినిధులు పెట్టుబడిదారులకు అప్పగించలేదు. దీంతో విసిగి పోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడు కాకర్ల శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో బాధితులంతా జయంత్రి కార్యాలయానికి క్యూ కట్టారు. ఇన్నాళ్లూ కష్టపడి సంపాదించి పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందో లేదోనని ఆందోళనకు గురౌతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story