Crime: జన్వాడ హెచ్పీ బంక్లో దారుణం.. యువకుల దాడిలో కార్మికుడి మృతి
రంగారెడ్డి జిల్లా నార్సింగి జన్వాడలో దారుణం చోటుచేసుకుంది. హెచ్పీ పెట్రోల్ పంపులో పనిచేసే సంజయ్పై ముగ్గురు యువకులు దాడి చేశారు. కారులో పెట్రోల్ పోయించుకున్న అనంతరం స్వైపింగ్ మెషీన్ పనిచేయడంలేదు క్యాష్ ఇవ్వమని అడగడంతో కార్మికులపై దాడికి దిగిన దుండగులు. వారిని ఆపేందుకు సంజయ్ రావడంతో అతనిపై మూకుమ్మడిగా దాడిచేశారు. దీంతో సంజయ్ ఘటనాస్థలంలోనే కుప్పకూలిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సంజయ్ మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. నిందితులు మల్లేష్, అనుప్,నరేందర్లుగా గుర్తించారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. సంజయ్ మృతితో అతని కుటుంబసభ్యులు, బంధువులు పెట్రోల్ బంక్ వద్ద ఆందోళనకు దిగారు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com