హైదరాబాద్ పోలీస్ కమీషనర్ గా సీవీ ఆనంద్ రెండోసారి బాధ్యతలు

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల సమస్యలపై పోరుపై దృష్టి సారించిందని, మాదక ద్రవ్యాలను నిర్మూలించేందుకు, నేరస్థులతో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. బంజారాహిల్స్లోని టీజీఐసీసీలో నగర పోలీస్ కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆనంద్ మాట్లాడుతూ రెండోసారి పోలీసు కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. ‘‘ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్పై సీరియస్గా ఉంది. మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తాం'' అని ఆనంద్, నేరస్థులను కఠినంగా ఎదుర్కొంటామని చెప్పారు.
1991 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆనంద్ డిసెంబర్ 2021 నుంచి అక్టోబర్ 2023 వరకు హైదరాబాద్ సీపీగా పనిచేశారు. తెలంగాణ కేడర్కు చెందిన సీవీ ఆనంద్ 2017లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పదోన్నతి పొంది కేంద్ర సర్వీసులకు వెళ్లి 2021లో తెలంగాణకు తిరిగొచ్చారు.
2023 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ హోదాను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023 ఎన్నికల సమయంలో ఆయనను సీపీ పదవి నుంచి తప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనంద్కు ఏసీబీ డీజీగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమితులయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com