DCC: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల ప్రకటన

తెలంగాణలో డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. మొత్తం 36 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. డీసీసీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సగానికి పైగా కేటాయించింది. ఆదిలాబాద్- నరేష్ జాదవ్, అసిఫాబాద్ - ఆత్రం సుగుణ, భద్రాద్రి కొత్తగూడెం - తోట దేవీ ప్రసన్న, భువనగిరి - బీర్ల అయిలయ్య, గద్వాల - ఎం. రాజీవ్ రెడ్డి, హన్మకొండ - వెంకటరాం రెడ్డి, హైదరాబాద్ - ఖలీఫ్ సైదుల్లా, జగిత్యాల - నందయ్య, జనగాం - లఖావత్ ధనావతి, భూపాలపల్లి - కరుణాకర్, కామారెడ్డి - మల్లిఖార్జున్, కరీంనగర్ - మేడిపల్లి సత్యం, కరీంనగర్ కార్పొరేషన్ - వీ. అంజన్ కుమార్, ఖైరతాబాద్ - రోహిత్ ముదిరాజ్, ఖమ్మం - నూతి సత్యనారాయణ, ఖమ్మం కార్పొరేషన్ - దీపక్ చౌదరి, మహబూబాబాద్ - భూక్య ఉమా, మహబూబ్నగర్ - సంజీవ్ ముదిరాజ్, మంచిర్యాల - రఘునాథ్ రెడ్డి, మెదక్ - శివన్నగిరి ఆంజనేయులు గౌడ్, మేడ్చల్ మల్కాజిగిరి - తోటకూర వజ్రేష్ యాదవ్, ములుగు - పైడాకుల అశోక్, నాగర్ కర్నూలు - డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, నల్గొండ - కైలాశ్ నేత, నారాయణ్పేట్ - కొల్లుకుదురు ప్రశాంత్ రెడ్డి, నిర్మల్ - వెడ్మ బొజ్జు, నిజామాబాద్ - నగేశ్ రెడ్డి, నిజామాబాద్ కార్పొరేషన్ - బొబ్బిలి రామకృష్ణ, పెద్దపల్లి - ఎంఎస్ రాజ్ ఠాకూర్, రాజన్న సిరిసిల్ల - సంగీతం శ్రీనివాస్, సికింద్రాబాద్ - దీపక్ జాన్, సిద్దిపేట్ - ఆంక్షా రెడ్డి, సూర్యాపేట్ - గుడిపాటి నర్సయ్య, వికారాబాద్ - ధారాసింగ్ జాదవ్, వనపర్తి - శివసేనా రెడ్డి, వరంగల్ - మహ్మద్ అయ్యుబ్లను డీసీసీ అధ్యక్షులుగా నియమించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

