Delhi liquor Scam: రెండోసారి విచారణకు ఎమ్మెల్సీ కవిత

X
By - Subba Reddy |16 March 2023 11:30 AM IST
కవిత, బుచ్చిబాబుని కలిపి విచారించే అవకాశం
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురువారం రెండోసారి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. విచారణలో భాగంగా ఇవాళ మరోసారి బుచ్చిబాబును అధికారులు విచారించనున్నారు. కవిత, బుచ్చిబాబుని కలిపి విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే మద్యం వ్యాపారి అరుణ్ పిళ్లై ఈడీ కస్టడీ నేటితో ముగియనున్నది. ఈ మేరకు మరికాసేపట్లో ఎమ్మెల్సీ కవిత మీడియ ముందుకు రానున్నది. ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో న్యాయ నిపుణులతో కవిత చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ నివాసం ప్రాంతంలో 144 సెక్షన్ను విధించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com