Delhi Liquor scam: అరుణ్ పిళ్లై కస్టడీ పొడిగింపు

Delhi Liquor scam: అరుణ్ పిళ్లై కస్టడీ పొడిగింపు
ఎమ్మెల్సీ కవితతో పాటు కలిపి ప్రశ్నించాలని కావున అతని కస్టడీ పొడిగించాలని ఈడీ విజ్ఙప్తి

ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరుణ్ పిళ్లై కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. ఎమ్మెల్సీ కవితతో పాటు కలిపి ప్రశ్నించాలని కావున అతని కస్టడీ పొడిగించాలని విజ్ఙప్తి చేసింది. ఈ క్రమంలో కల్వకుంట్ల కవిత ఈ రోజు విచారణకు హాజరు కాలేదా అని కోర్టు ప్రశ్నించింది. దీంతో కవిత విచారణకు హాజరు కాలేదని ఈడీ పేర్కొంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత, అరుణ్‌ పిళ్లై మధ్య జరిగిన కొన్ని లావాదేవీల గురించి ప్రశ్నించాల్సి ఉందని ఈడీ తరుపు న్యాయవాది తెలిపారు. ఇద్దరి బ్యాంక్‌ స్టేట్‌మెంట్స్‌ వచ్చాయి కదా వాటిని పరిశీలిస్తే సరిపోతుందని కోర్టు పేర్కొంది. వాదోపవాదనలు విన్న తరువాత పిళ్లై కస్టడీ పొడిగిస్తూ స్పెషల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే లిక్కర్‌ కేసులో కవిత అనుమానితురాలని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో పిళ్లైకు కోర్టు ఈ నెల 20 వరకు కస్టడీ పొడిగించింది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కోర్టులో హాజరు పరచాలని ఈలొగా అందరితో కలిపి విచారణ పూర్తి చేయాలని ఈడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story