Delhi Liquor Scam: ముచ్చటగా మూడో సారి

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నేడు మరోసారి ఈడీ విచారించనుంది. ఈడీ విచారణకు ముందు కవిత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మూడో సారి ఆమెను విచారించనున్న ఈడీ అధికారులు. సోమవారం దాదాపు పది గంటలకు పైగా విచారణ చేశారు. 14 ప్రశ్నలతో కవితను ఉక్కిరిబిక్కిరి చేశారు ఈడీ అధికారులు. బుచ్చిబాబు, పిళ్లై ఇచ్చిన వాంగ్మూలాల్లోని అంశాలపై ప్రశ్నలు సంధించారు. అయితే నేడు సిసోడియాతో కలిపి ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్, సౌత్ గ్రూప్ ఏర్పాటు, పెట్టుబడులు, సౌత్గ్రూప్-ఆప్ మధ్య వ్యవహారాలపై ఈడీ ప్రశ్నించింది. ఈ అంశాలపై ఇవాళ కూడా కవితను విచారిస్తామని ఈడీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈ రోజైనా కవిత విచారణ పూర్తి అవుతుందా లేదా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com