స్పీకర్, టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై రఘునందన్రావు ఫైర్

X
By - TV5 Digital Team |15 March 2021 7:00 PM IST
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. అయితే బీఏసీ సమావేశానికి బిజెపి సభ్యులను పిలవకపోవడంపై ఆపార్టీ ఎమ్మెల్యే రఘునందన్రావు తీవ్రంగా తప్పుబట్టారు. టీఆర్ఎస్ అవకాశవాద రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఏ నిబంధనల మేరకు బీఏసీ సమావేశానికి బిజెపి సభ్యులను పిలవలేదో చెప్పాలన్నారు. సభా గౌరవాన్ని స్పీకర్ పెంచుతారని ఆశించామన్న ఆయన.. నెంబర్ లేక పిలవలేదనడం సరైంది కాదన్నారు. రేపు ఉదయం స్పీకర్ను కలిసి శాంతియుత నిరసన వ్యక్తం చేస్తామని రఘునందన్రావు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com