Earthquake in Telangana: తెలంగాణలోని ఈ జిల్లాల్లో భూప్రకంపనలు..

Earthquake in Telangana: తెలంగాణలోని ఈ జిల్లాల్లో భూప్రకంపనలు..
Earthquake in Telangana: మామూలుగా ఉత్తర రాష్ట్రాల్లో భూకంపం వచ్చిందన్న వార్తలు వింటుంటాం.

Earthquake in Telangana: మామూలుగా ఉత్తర రాష్ట్రాల్లో భూకంపం వచ్చిందన్న వార్తలు వింటుంటాం. కానీ ఈసారి మన రాష్ట్రంలోనే భూకంపం తాకిడి అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో శనివారం భూమి స్వల్పంగా కంపించింది. మంచిర్యాల జిల్లాలో కాలేజ్‌ రోడ్‌, సున్నంబట్టివాడ, శ్రీశ్రీనగర్, సీతారాంపల్లి, నస్పూర్, సీతారాంపూర్‌, షిర్కేలో రెండు సెకండ్లపాటు భూమి కంపించింది. పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ, జ్యోతినగర్, మల్కాపూర్, నర్రాశాలపల్లె ప్రాంతాలలో 2 సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

Tags

Read MoreRead Less
Next Story