EETALA: "పేదల ఉసురు తప్పక తలుగుతుంది"

EETALA: పేదల ఉసురు తప్పక తలుగుతుంది
X
హైడ్రా కూల్చివేతలపై ఈటల ఆగ్రహం

హై­ద­రా­బా­ద్‌­లో హై­డ్రా కూ­ల్చి­వే­త­లు రా­జ­కీయ ప్ర­కం­ప­న­లు సృ­ష్టి­స్తు­న్నా­యి. పే­దో­ళ్ల ఇళ్ల కూ­ల్చి­వే­త­ల­పై ఎంపీ ఈటల రా­జేం­ద­ర్ మం­డి­ప­డ్డా­రు. "30, 60 గజా­ల్లో ఇళ్లు కట్టు­కుం­టో­డు ఉన్నో­డా, లే­నో­డా ము­ర్ఖు­ల్లా­రా.." అని కాం­గ్రె­స్ ప్ర­భు­త్వా­న్ని ఈటల ఘా­టు­గా ప్ర­శ్నిం­చా­రు. ప్ర­భు­త్వా­ని­కి కళ్లు కన­బ­డ­టం లేదా అంటూ ఫైర్ అయ్యా­రు. బం­జా­రా హి­ల్స్‌­లో ఎకరా రూ.50 కో­ట్లు, రూ.60 కో­ట్లు, రూ.100 కో­ట్ల భూ­ము­ల­ను కాం­గ్రె­స్ నే­త­లు కబ్జా చేసి ఆక్ర­మిం­చా­ర­ని ఆరో­పిం­చా­రు. "వా­టి­ని రి­జి­స్ట­ర్ చే­య­డా­ని­కి జీవో నెం.58,59 తీ­సు­కొ­చ్చా­రు కదరా.. నా కొ­డ­కా.." అంటూ ఆగ్ర­హం­తో ఈటల ఊగి­పో­యా­రు. పే­దో­ళ్ల బతు­కు­ల్లో మట్టి కొ­డి­తే ఏమో­స్తుం­ద­ని ని­ల­దీ­శా­రు. రే­వం­త్ ప్ర­భు­త్వం పేదల జీ­వి­తా­ల­తో చె­ల­గా­టం ఆడు­తోం­ద­ని, వారి ఉసు­రు తప్పక తగు­లు­తుం­ద­ని పే­ర్కొ­న్నా­రు.

అడ్డుకున్న గాంధీ

మాదాపూర్‌లోని సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలను ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అడ్డుకున్నారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నం చెరువులో కూల్చివేతలను ఆపేయాలని డిమాండ్ చేశారు. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను కూల్చేశారు. చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను తొలగించారు. చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించొద్దని హైడ్రా సూచించింది. అక్రమంగా నీటిని తరలిస్తున్న పలు వాటర్‌ ట్యాంకర్లను సీజ్‌ చేసింది.

Tags

Next Story