Election Commission : బీజేపీకి షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్..
By - Divya Reddy |11 Aug 2022 10:47 AM GMT
Election Commission : సాలు దొర-సెలవు దొర ప్రకటనలకు బ్రేక్ పడింది. తెలంగాణ బీజేపీ విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది.
Election Commission : సాలు దొర-సెలవు దొర ప్రకటనలకు బ్రేక్ పడింది. తెలంగాణ బీజేపీ విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా సాలు దొర-సెలవు దొర అంటూ పోస్టర్లు ముద్రించడానికి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కించపరిచే విధంగా పోస్టర్లు, ఫొటోలు, రాతలు ఉండకూడదని చాలా స్పష్టంగా చెప్పింది ఎన్నికల కమిషన్. సాలు దొర-సెలవు దొర ఎలక్షన్ క్యాంపైన్కు అనుమతి కోరుతూ మీడియా సర్టిఫికేషన్ కమిటీకి తెలంగాణ బీజేపీ దరఖాస్తు చేసుకుంది. అయితే ఎన్నికల సంఘం.. మీడియా సర్టిఫికేషన్ అనుమతిని నిరాకరించింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com