ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలతో ఈటెల మంతనాలు..!

ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలతో ఈటెల మంతనాలు..!
నిన్న బీజేపి నేత, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయిన ఆయన.. ఇవాళ మరికొంత మంది ముఖ్య నేతలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది..నిన్న బీజేపి నేత, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయిన ఆయన.. ఇవాళ మరికొంత మంది ముఖ్య నేతలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీలో సముచిత స్థానం కల్పించే విషయం పై ఈటెలకి ... హై కమైండ్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో ఇవ్వాళ ఢిల్లీ పర్యటన ముగిసాక హైదరాబాద్ తిరిగి రాగానే కార్యకర్తలతో వరుస సమావేశాలు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బీజేపిలో ఎప్పుడు చేరాలి. ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు రాజీనామా చేయాలి అనే అంశంపై ఈ వారంలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

నిన్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో కలిసి జేపీ నడ్డాతో సమావేశమైన ఈటల.. భవిష్యత్తు పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ కి మధ్య స్నేహం ఉందని ప్రచారం జరుగుతోందని, భవిష్యత్తులో రెండు పార్టీలు కలిస్తే తమ పరిస్థితి ఏంటని ఈటల నడ్డాను ప్రశ్నించారు. దీనితో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తో పోరాడినట్టే తెలంగాణలో టీఆర్ఎస్ తో కోట్లాడతామని నడ్డా చెప్పుకొచ్చారు.

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కూడా ధీమా వ్యక్తం చేశారు. ఇక ఆరోపణల మీద ఉన్న అంశాలలో సరైన సమయంలో విచారణ కూడా ఉంటుందని చెప్పినట్లు సమాచారం. నడ్డాతో భేటీ అనంతరం ... తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి ఇంచార్జ్ తరుణ్ నివాసానికి వెళ్ళారు. అక్కడ అయనతోనూ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.



Tags

Read MoreRead Less
Next Story