కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఈటల
By - Gunnesh UV |19 Aug 2021 8:06 AM GMT
Etela Rajender: దళితబంధు పధకం తరహాలోనే అన్ని కులాల్లో పేదలకు ప్రభుత్వం 10 లక్షలు ఆర్థిక సాయం చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
దళితబంధు పధకం తరహాలోనే.. అన్ని కులాల్లో పేదలకు ప్రభుత్వం 10 లక్షలు ఆర్థిక సాయం చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. దళితులకు ఇస్తున్న డబ్బులపై కలెక్టర్లు, బ్యాంకర్ల అజమాయిషీ లేకుండా చూడాలన్నారు. ఇప్పుడు హుజురాబాద్లో తనను ఓడించేందుకే CM కేసీఆర్ దళిత జపం చేస్తున్నారని విమర్శించారు. సీఎం సామాజిక వర్గానికి ఇచ్చిన పదవులెన్ని.. దళితులకు ఇచ్చినవెన్ని లెక్క తీస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు. బైపోల్లో తనను ఓడించేందుకు సొంత పార్టీ నేతలనే కొంటున్న చరిత్ర KCRదని ఈటల విమర్శించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com