పడిపోయిన షుగర్ లెవెల్స్ .. దీక్ష విరమించిన బండి సంజయ్

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరసన దీక్ష విరమించారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని అపోలో రీచ్ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆయన షుగర్ లెవెల్స్ 70కి పడిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. షుగర్తోపాటు బీపీ కూడా పడిపోయినట్లు బండి సంజయ్ని పరామర్శించిన తర్వాత మాజీ ఎంపీ వివేక్ తెలిపారు. బండి సంజయ్ ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సిద్దిపేట సీపీని వెంటనే విధుల నుంచి తొలగించాలని వివేక్ డిమాండ్ చేశారు.
దుబ్బాకలో జరుగుతున్న పరిణామాలను నిరసిస్తూ బండి సంజయ్ సోమవారం సాయంత్రం నుంచి తన ఆఫీసులోనే దీక్ష చేపట్టారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పార్టీ శ్రేణులు ఆయనను ఆసుపత్రికి తరలించాయి. నిరసన దీక్ష వల్ల ఆరోగ్యం క్షీణించడంతో పార్టీ నేతల సూచన మేరకు ఆయన దీక్ష విరమించినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com