Kamareddy: కామారెడ్డి జిల్లాలో రైతు ఆత్మహత్య.. నిన్నటి నుంచి చెట్టుకే ఉన్న మృతదేహం..
By - Divya Reddy |21 Feb 2022 8:56 AM GMT
Kamareddy: కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో రైతు ఆత్మహత్య వివాదస్పదమైంది.
Kamareddy: కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో రైతు ఆత్మహత్య వివాదస్పదమైంది. పొలంగట్టు విషయంలో గొడవ కారణంగా మనస్తాపం చెందిన సిద్ధ రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్ద రాములు భూమిని బిక్నూరుకు చెందిన ఓరైతు కబ్జా చేశాడని బాధిత కుటుంబం చెబుతోంది.
పోలీసులు కబ్జాచేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా బాధితుడిపైనే వేధింపులకు దిగారని ఆరోపించారు. సిద్ధరాములు మృతికి కారణమైన వ్యక్తి ఘటనా స్థలానికి వచ్చేవరకు.. శవాన్ని చెట్టుపై నుంచి దించేది లేదంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని సముదాయించారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని దింపనిచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com