FARMERS: బస్తా యూరియా కోసం రైతన్నల పడిగాపులు

FARMERS: బస్తా యూరియా కోసం రైతన్నల పడిగాపులు
X
బస్తా యూరియా కోసం రైతన్నల పడిగాపులు... తెల్లవారకముందే లైన్లలో నిలబడుతున్న రైతులు.. ఒక్క బస్తానైనా ఇవ్వండంటూ అన్నదాతల వేడుకోలు

రై­తు­ల­కు బస్తా యూ­రి­యా సం­పా­దిం­చ­డం గగ­న­మ­వు­తోం­ది. పొ­ట్ట­ద­శ­కు చే­రు­కుం­టు­న్న వరి­కి, పూత దశ­కొ­స్తు­న్న పత్తి పంట సహా ఇతర పం­ట­ల­కు చల్లేం­దు­కు యూ­రి­యా దొ­ర­క్క­పో­వ­డం­తో రై­తు­లు గోస పడు­తు­న్నా­రు. పం­ట­ల­కు ఎరు­వు­లు లే­క­పో­తే ది­గు­బ­డి తగ్గు­తుం­ద­నే ఆం­దో­ళ­న­తో తె­ల్ల­వా­ర­ముం­దే కేం­ద్రాల వద్ద­కు చే­రు­కుం­టు­న్నా­రు. ఓపి­గ్గా క్యూ­లో ని­ల్చుం­టు­న్నా­రు. యూ­రి­యా ఇవ్వా­లం­టూ కొ­న్ని­చో­ట్ల సి­బ్బం­ది కా­ళ్లు పట్టు­కొ­ని వే­డు­కుం­టు­న్నా­రు. ఇం­కొ­న్ని­చో­ట్ల ఓపిక నశిం­చి కన్నె­ర్ర చే­స్తు­న్నా­రు. రా­స్తా­రో­కో­ల­తో ఆం­దో­ళ­న­లు చే­స్తు­న్నా­రు. ఈ దృ­శ్యా­లు గు­రు­వా­రం కూడా తె­లం­గాణ వ్యా­ప్తం­గా కని­పిం­చా­యి.

రక్తం చిందించిన రైతు..


యూ­రి­యా బస్తాల కోసం తె­లం­గాణ రై­తు­లు యు­ద్ధం చే­యా­ల్సిన పరి­స్థి­తి నె­ల­కొం­ది. మహ­బూ­బా­బా­ద్ జి­ల్లా మరి­పెడ మం­డ­లం మల్ల­మ్మ కుంట తం­డా­కు చెం­దిన అజ్మీ­రా లక్క, విజయ అనే దం­ప­తు­ల­కు 20 రో­జు­లై­నా యూ­రి­యా దొ­ర­క­లే­దు. ఇవాళ ఇస్తు­న్నా­ర­ని తె­లి­సి భా­ర్య భర్త­లు వచ్చి క్యూ­లై­న్‌­లో ని­ల­బ­డ్డా­రు. అయి­తే లక్క­కు గతం­లో పక్ష­పా­తం వచ్చి ఇబ్బం­ది పడు­తు­న్నా­డు. లై­న్‌­లో ని­ల­బ­డి ఒక్క­సా­రి­గా సొ­మ్మ­సి­ల్లి మె­ట్ల పై­నుం­చి కింద పడ­డం­తో తల పగి­లి గా­య­మైం­ది. . వెం­ట­నే అక్కడ ఉన్న సి­బ్బం­ది లక్క­ను ప్ర­భు­త్వ దవా­ఖా­న­కు తర­లిం­చా­రు. ప్ర­భు­త్వం ఇప్ప­టి­కై­నా రై­తుల కష్టా­ల­ను చూసి సరి­ప­డా యూ­రి­యా సర­ఫ­రా చే­యా­ల­ని రై­తు­లు కో­రు­తు­న్నా­రు.

క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు

రై­తు­లు ఆం­దో­ళన చెం­ద­వ­ద్ద­ని అధి­కా­రు­లు చె­బు­తు­న్నా.. క్షే­త్ర­స్థా­యి­లో మా­త్రం భి­న్న పరి­స్థి­తు­లు దర్శ­న­మి­స్తు­న్నా­యి. వా­నా­కా­లం సీ­జ­న్‌­లో సా­గైన పత్తి, మొ­క్క­జొ­న్న పం­ట­లు ఎదు­గు­దల దశలో ఉం­డ­గా.. వరి నా­ట్ల­కు ఉప­యో­గిం­చే దశలో సరి­ప­డా ని­ల్వ­ల్లేక కర్ష­కు­లు ఆం­దో­ళన చెం­దు­తు­న్నా­రు. గతం­తో పో­లి­స్తే ఈ ఏడా­ది మొ­క్క­జొ­న్న, వరి పం­ట­లు వి­స్తీ­ర్ణం పె­ర­గ­డం వా­టి­కి ఒకే­సా­రి యూ­రి­యా అవ­స­రం కా­వ­డం­తో డి­మాం­డ్‌ పె­రి­గి­న­ట్లు తె­లి­సిం­ది. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిరిసిల్లలో కేవలం 250 బస్తాల యూరియా రాగా 500 మంది రైతులు వచ్చారు. ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులకు కేవలం ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుచూపు వైఖరి లేకపోవడం వల్ల రైతుల పట్ల ఉదాసీన వైఖరి అవలంబించడంతో రైతులు యూరియా కొరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వికలాంగులు వృద్ధులు మహిళలు కూడా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

50 వేల మెట్రిక్ టన్నుల యూరియా

ఇక తె­లం­గా­ణ­కు 50వేల మె­ట్రి­క్‌ టన్నుల యూ­రి­యా సర­ఫ­రా చే­యా­ల­ని కేం­ద్రం ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. ఈ యూ­రి­యా­ను ఈ వా­రం­లో­నే సర­ఫ­రా చే­యా­ల­ని కేం­ద్ర రసా­య­నా­లు ఎరు­వు­లు మం­త్రి­త్వ శా­ఖ­కు రా­ష్ట్ర వ్య­వ­సా­య­శాఖ మం­త్రి తు­మ్మల నా­గే­శ్వ­ర­రా­వు వి­జ్ఞ­ప్తి చే­శా­రు. రా­ష్ట్రం­లో నె­ల­కొ­న్న యూ­రి­యా కొ­ర­త­పై తె­లం­గాణ కాం­గ్రె­స్‌ ఎం­పీ­లు పా­ర్ల­మెం­టు ఆవ­ర­ణ­లో చే­సిన ని­ర­సన ప్ర­ద­ర్శ­న­తో కేం­ద్రా­ని­కి పరి­స్థి­తు­లు తె­లి­శా­య­ని తె­లి­పా­రు. కాగా కర్ణా­టక నుం­చి 10,800 టన్నుల యూ­రి­యా మొ­ద­టి షి­ప్‌­మెం­ట్‌ ప్రా­రం­భ­మైం­ద­ని.. ఈవా­రం­లో మరో మూడు షి­ప్‌­మెం­ట్ల ద్వా­రా యూ­రి­యా సర­ఫ­రా చే­యా­ల­ని కో­ర­మాం­డ­ల్‌ ఇం­ట­ర్నే­ష­న­ల్‌ లి­మి­టె­డ్‌­కు డై­రె­క్ట­ర్‌ ఆఫ్‌ ఫె­ర్టి­లై­జ­ర్స్‌ ఆదే­శా­లు జారీ చే­సిం­ద­ని చె­ప్పా­రు. కొం­ద­రు బీ­ఆ­ర్‌­ఎ­స్‌ నే­త­లు వారి అను­చ­రు­ల­ను యూ­రి­యా కేం­ద్రాల వద్ద చె­ప్పు­లు క్యూ­లై­న్‌­లో పె­ట్టి యూ­రి­యా కొ­ర­త­పై రై­తాం­గం ఆం­దో­ళన చెం­దే వి­ధం­గా కు­ట్ర­లు చే­స్తు­న్నా­ర­ని మం­డి­ప­డ్డా­రు. ఈ ఖరీ­ఫ్‌ సీ­జ­న్‌­కు రా­ష్ట్రా­ని­కి 9.80 లక్షల మె­ట్రి­క్‌ టన్నుల యూ­రి­యా­ను కేం­ద్రం కే­టా­యిం­చిం­ది. ఆగ­స్టు 31 నా­టి­కి 8.30 లక్షల మె­ట్రి­క్‌ టన్నుల యూ­రి­యా సర­ఫ­రా చే­యా­ల్సి ఉం­డ­గా... ఇప్ప­టి­వ­ర­కు 5.42 లక్షల మె­ట్రి­క్‌ టన్ను­లే సర­ఫ­రా చే­శా­రు.

Tags

Next Story