Filmnagar: అప్పు తీర్చడం లేదని దంపతుల దారుణ హత్య

Filmnagar: అప్పు తీర్చడం లేదని దంపతుల దారుణ హత్య
విచారణలో బయటపడ్డ షాకింగ్ నిజాలు.

అప్పు రెండుప్రాణాలను బలితీసుకుంది. వ్యాపారఒప్పందంలో తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకపోవడం దంపతుల హత్యకు దారి తీసింది. పోలీసులకు ఆధారాలు లభించకుండా నిందితులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. హత్యానేరం తమమీదికి రాకుండా యత్నించారు. భార్యను హత్య చేసి భర్త పారిపోయాడని పోలీసులకు అనుమానం కలిగేలా చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు 10రోజుల తర్వాత నిందితులను అరెస్ట్ చేశారు.

యూట్యూబ్‌ ద్వారా ఏర్పడిన పరిచయం.. వ్యాపారానికి బాటలు వేసింది. గొర్రెల పెంపకం, విక్రయం వ్యాపారంలోభాగస్వామ్యం కోసం విడతలవారీగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడకపోవడం ఇరువురి మధ్య కక్ష్లకు దారితీసింది.చివరకు దంపతులహత్యకు కారణమైంది. గతనెల 29న హైదరాబాద్‌లోని సత్యకాలనీలో మహిళ మృతిచెందినట్లు పోలీసులకు సమాచారంవచ్చింది. అక్కడకి వెళ్లిన పోలీసులు ఆమెని ఫాతిమాగా గుర్తించి..హత్యచేసినట్లుగా కేసు నమోదు చేశారు. మృతురాలి భర్తఫోన్ స్విచాఫ్ ఉండటం..అతని హెల్మెట్, ఇతర వస్తువులు లభించగా భర్త హత్యచేసినట్లు అనుమానించారు. ఫాతిమా మృతదేహానికి పోస్టుమార్టం చేశాక కుటుంబీకులకుకు అప్పగించారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాలు పరిశీలించగా... ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు గతనెల 29వ తేదీ మధ్యాహ్నం....లోపలికి వెళ్లినట్లు గుర్తించారు. ఆ ముగ్గురు ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు సమీపంలో 200 సీసీ కెమెరాలను పరిశీలించారు. చివరికి అందులో ఒకరు మణికొండకు చెందిన సమీర్‌గా గుర్తించారు. అతడిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఫాతిమాను చంపింది భర్తకాదని ముంబయికి చెందిన అజ్ఘర్ పాషాగా గుర్తించారు.

హైదరాబాద్‌కు చెందిన మహిళను పదేళ్లక్రితం పెళ్లిచేసుకున్న అజ్ఘర్‌పాషా..... నదీం కాలనీలో ఉంటూ గొర్రెలపెంపకం, విక్రయం చేస్తున్నాడు. ఈక్రమంలో నాలుగేళ్లక్రితం యూట్యూబ్‌ ద్వారా జుబేర్‌ఖాద్రీతో పరిచయం ఏర్పడింది. ఆనంతరం వారిద్దరి మధ్య వ్యాపార భాగస్వామ్యం కుదిరింది. జుబేర్‌ ఫాంహౌజ్‌లో గొర్రెలు, మేకలు పెంచేందుకు అజ్ఘర్‌ విడతల వారీగా 20లక్షలకు పైగాచెల్లించాడు. లాభం ఇవ్వకపోవటంతో డబ్బులు ఇచ్చేయాలని కోరగా జుబేర్‌ దాటవేస్తూ వచ్చాడు. కక్షపెంచుకున్న అజ్ఘర్‌ జుబేర్‌ హత్యకు కుట్ర పన్నాడు. అందుకోసం ముంబైలోని స్నేహితుడు సల్మాన్‌తో పాటు మణికొండకు చెందిన సమీర్ సాయం తీసుకున్నాడు. గతనెల 28న బిర్యాని తిందామంటూ నదీంకాలనీలో ఫామ్‌హౌజ్‌కి జుబేర్‌ని పిలిపించాడు. అక్కడకి వచ్చిన జుబేర్‌ని ముఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి హత్యచేసి సమీపంలోని చెరువుపక్కన మృతదేహం పూడ్చిపెట్టారు. ఇంట్లో నగదుదాచి ఉండొచ్చని భావించిన అజ్ఘర్.. జుబేర్‌ ఇంటికి వెళ్లారు. ఎక్కడా వెతికినా ఎ డబ్బులు కనపడలేదు. రాత్రివరకు ఇంట్లో ఉన్న నిందితులు...జుబేర్‌ భార్య ఫాతిమా రాగానే గొంతునులిమి చంపి చున్నీతో ఫ్యాన్‌కి ఉరేసి ఒంటిపై ఉన్న 9 తులాల బంగారం తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి ఇంటికి వచ్చిన ఫాతిమాసోదరి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగుచూసింది. జంటహత్యలకు పాల్పడిన ముగ్గురి నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story