మేడ్చల్ రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం

X
By - kasi |3 Nov 2020 4:03 PM IST
మేడ్చల్ రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగిఉన్న పుష్పుల్ రైలు బోగీల్లో మంటలు వ్యాపించాయి. వెంటనే అలర్ట్ అయిన రైల్వే సిబ్బంది మంటలను ఆర్పే..
మేడ్చల్ రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగిఉన్న పుష్పుల్ రైలు బోగీల్లో మంటలు వ్యాపించాయి. వెంటనే అలర్ట్ అయిన రైల్వే సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ ఇంజన్ ఇంకా రాకపోవడంతో సిబ్బంది బకెట్లతో నీటిని తెచ్చి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పక్క ట్రాక్లోమరో రైల్ ఆగి ఉండటంతో మంటలు దానికి వ్యాపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మంటలు వ్యాపించడానికి గల కారణాలు తెలియరాలేదు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com