స్కూల్లో అగ్ని ప్రమాదం.. మంటలను చూసి పక్క భవనంపైకి దూకిన విద్యార్థులు

X
By - Nagesh Swarna |4 Feb 2021 1:23 PM IST
మంటలను చూసి కొంతమంది భయంతో పరుగులు తీశారు.
హైదరాబాద్ గౌలిపురాలోని శ్రీనివాస స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగడంతో స్కూలు ఆఫీసు రూం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో స్కూల్లో 40 మంది విద్యార్థులు ఉన్నారు.
మంటలను చూసి భయంతో పరుగులు తీశారు. కొందరైతే... ఆ స్కూల్ రెండో అంతస్తు నుంచి పక్క భవనంపైకి దూకారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది... మంటలను అదుపు చేశారు. స్థానికులు అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయని అంచనా వేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com