చేప ప్రసాదం పంపిణీ కర్త బత్తిని హరినాథ్ ఇక లేరు
హైదరాబాద్లోని ప్రముఖ చేప ప్రసాదం ప్రధాన నిర్వాహకుడు బత్తిని హరినాథ్ గౌడ్ బుధవారం రాత్రి కవాడిగూడలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
బత్తిని కుటుంబం ప్రతి సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ చేయడంలో ప్రసిద్ధి చెందింది. గత 173 సంవత్సరాలుగా ఆస్తమాతో బాధ పడేవారికి బత్తిన కుటుంబం చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తోంది. చేప ప్రసాదం దగ్గు, ఆస్తమా మరియు ఇతర శ్వాసకోశ వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుందని నగర ప్రజలు విశ్వసించడంతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు వేల సంఖ్యలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. ఈ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. అందువలనే ఈ కార్యక్రమం కొన్ని ఏళ్లుగా నిర్విరామంగా కొనసాగుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com