tg: తెలంగాణలో కొత్తగా ఐదు పీజీ వైద్య కళాశాలలు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పీజీ వైద్య కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. పూర్తిగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు ఉండే విధంగా మెడికల్ కాలేజీలో ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనివల్ల స్పెషాలిటీ డాక్టర్ల కొరత తీరడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో 200 పడకలతో ఉన్న ఆసుపత్రులు పీజీ కోర్సుల కోసం బోధనాస్పత్రులుగా మారనున్నాయి. పీజీ కోర్సు కు సంబంధించి 1:4 నిష్పత్తిలో వైద్య విద్య సీట్ల కొరత ఉంది. దీనిని అధిగమించడానికి ప్రధాన ప్రాంతాలైన కింగ్ కోఠి, బాన్సువాడ, పెద్దపల్లి, భద్రాచలం, మిర్యాలగూడ ప్రాంతాల్లో పీజీ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన జాతీయ మెడికల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ గంగాధర్తో ఇదే విషయంపై ప్రత్యేకంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చర్చించారు. పీజీ వైద్యుల కాలేజీ ఏర్పాటుకు మార్గం సుగమం అయినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ మెడికల్ ఐదు కాలేజీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. పదేళ్ల కిందట 2016లో మహబూబ్ నగర్, సిద్దిపేటల్లో కళాశాలలు ఏర్పాటు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com