మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత..!
By - TV5 Digital Team |10 May 2021 4:35 AM GMT
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీ బి. ప్రసాదరావు కన్నుమూశారు. అమెరికాలో ఉంటున్న ఆయనకు ఛాతి నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీ బి. ప్రసాదరావు కన్నుమూశారు. అమెరికాలో ఉంటున్న ఆయనకు ఛాతి నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. 1979 IPS బ్యాచ్ కు చెందిన ప్రసాదరావు ఏసీబీ డీజీ, హైదరాబాద్ సీపీ, విశాఖ ఎస్పీగానూ పనిచేశారు. 1997లో భారత పోలీసు పతకం, 2006లో రాష్ట్రపతి పతకం అందుకున్నారు. 'వర్డ్ పవర్ టు మైండ్ పవర్' అనే పుస్తకాన్ని రాశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com