మరోసారి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

X
పాతబస్తీలో హిందూ జనాభా తగ్గించే కుట్రలు జరుగుతున్నాయంటూ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ లో బీజేపీ గెలిచిన తరువాత.. పాతబస్తీలో ఉన్న రోహింగ్యాలు, పాకిస్థానీయులను వెళ్లగొడతామని మరోసారి స్పష్టం చేశారు. చిరాన్ పోర్టు క్లబ్ లో డాక్టర్లతో సమావేశమైన ఆయన.. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు..
సీఎం కేసీఆర్ భాషే అయనకు అప్పచెప్పుతున్నాను అన్నారు బండి సంజయ్.. ఈ మాటలు నేర్పిన గురువు ఆయనే అంటూ సెటైర్ వేశారు.. అయితే తాను ధర్మాన్ని నమ్ముతాను కాబట్టి సంస్కారవంతమైన భాష మాట్లాడుతానని.. సీఎం కేసీఆర్ లా తిట్లు తిట్టడం రాదన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
