శుక్రవారం హైదరాబాద్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

శుక్రవారం హైదరాబాద్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ జాతీయ నేతలతో ప్రచారం చేయిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌కు మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్‌, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హైదరాబాద్‌కు వచ్చి గ్రేటర్‌ జోష్‌ను పెంచారు. ఇప్పుడు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం భాగ్యనగరానికి వస్తున్నారు. వాస్తవానికి జేపీ నడ్డా టూర్‌ షెడ్యూల్‌ ప్రకారం 28న రావాల్సి ఉంది. అయితే... ఆయన పర్యటనలో స్వల్ప మార్పు జరిగింది. ఆయన శుక్రవారం హైదరాబాద్‌కు వస్తారని బీజేపీ శ్రేణులు తెలిపాయి. సాయంత్రం 4 గంటలకు నాగోల్‌లో రోడ్‌షోలో నడ్డా పాల్గొంటారని వెల్లడించారు బీజేపీ నేతలు. శనివారం యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌, 29న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.



Tags

Read MoreRead Less
Next Story