GHMC Elections : 105 మంది అభ్యర్థులతో టీఆర్ఎస్ తొలి జాబితా విడుదల

105 మంది అభ్యర్థులతో గ్రేటర్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది టీఆర్ఎస్. మెజార్టీ స్థానాల్లో సిట్టింగ్లకే తిరిగి టికెట్లు కేటాయించారు.. కేకే కుమార్తె విజయలక్ష్మి, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, మన్నె కవిత సహా పలువురికి టికెట్లు ఖరారు చేశారు. చర్లపల్లి టికెట్ బొంతు రామ్మోహన్కా..? ఆయన సతీమణికా..? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.. ఇక హోరాహోరీగా పోరు ఉంటుందన్న చోట్ల ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.. ఓల్డ్సిటీలో 30 డివిజన్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు.
మొత్తం 150డివిజన్లలో ప్రస్తుతం 105 మంది అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటించారు. మిగతా 45 మంది జాబితా రేపు విడుదల చేయనున్నారు. గోల్నాకలో ఈసారి MLA కాలేరు వెంకటేష్ భార్యకు బదులు ముస్లిం మహిళకు ఛాన్స్ ఇచ్చారు.. బోరబండ నుంచి మళ్లీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్కు టికెట్ ఖరారు చేశారు.. ఇక కొందరు వివాదాస్పద కార్పొరేటర్లకు మరోసారి టికెట్లు ఇచ్చారు. అటు TRSలో చేరినా తన వర్గానికి టికెట్లు ఇప్పించుకోలేకపోయారు ఎమ్మెల్యే సుధీర్రెడ్డి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com