GHMC :కరోనా మృతదేహాల అంత్యక్రియలకు రూ.8వేలు

GHMC :కరోనా మృతదేహాల అంత్యక్రియలకు రూ.8వేలు
GHMC : అంత్యక్రియలకు స్మశానవాటికల్లో సిబ్బంది ఇష్టానుసారం డబ్బులు వసూలు చేస్తుండటంపై GHMC స్పందించింది.

GHMC : అంత్యక్రియలకు స్మశానవాటికల్లో సిబ్బంది ఇష్టానుసారం డబ్బులు వసూలు చేస్తుండటంపై GHMC స్పందించింది. కోవిడ్ తో చనిపోయిన వారి అంత్యక్రియలకు రూ.8వేలు, నాన్-కోవిడ్ వారి అంత్యక్రియలకు రూ.6వేలు, కోవిడ్ మృతులను ఎలక్ట్రిక్ మెషిన్ పై దహనం చేస్తే రూ.4వేలు తీసుకోవాలని ప్రకటించారు. ఈ మేరకు స్మశానవాటికల్లో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. నిబంధ‌న‌లు పాటించ‌కుండా అధికంగా వ‌సూలు చేస్తే క‌ఠినంగా చ‌ర్యలు ఉంటాయ‌ని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా పాజిటివ్‌ వచ్చిన పారిశుధ్య సిబ్బందికి పూర్తి వేతనం ఇస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. వైరస్ వచ్చిన సమాచారాన్ని అధికారులకి తెలియజేయాలని వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story